ప్రమాదవశాత్తు నీట మునిగి ఒకరి మృతి

ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తడపాకల్ గోదావరి నది వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

Update: 2023-05-07 14:08 GMT

దిశ, ఏర్గట్ల : ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తడపాకల్ గోదావరి నది వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్ పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన దామ లింబాద్రి (29)యూకో బ్యాంక్ లో క్లర్క్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో లింబాద్రి తన బాబాయ్ కొడుకు వివాహానికి తడపాకల్ కు వచ్చాడు. దీంతో పక్కనే ఉన్న గోదావరి నదిలో స్నానానికి అని వెళ్లి ఈత రాక నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. లింబాద్రికి భార్య, కుమారుడు ఉన్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

Tags:    

Similar News