ఆత్మహత్యాయత్నం: పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి

దిశ, చేవెళ్ల: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మల్కాపూర్-కందాడ మధ్యలో మంగళవారం చోటుచేసుకుంది. ఒళ్లంతా కాలిపోయి గాయాలతో రోడ్డు పక్కన ఆ వ్యక్తిని పలువురు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బాధితుడు షాబాద్ మండలం రేగడిదోస్‌వాడ గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డిగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-06-22 01:44 GMT

దిశ, చేవెళ్ల: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మల్కాపూర్-కందాడ మధ్యలో మంగళవారం చోటుచేసుకుంది. ఒళ్లంతా కాలిపోయి గాయాలతో రోడ్డు పక్కన ఆ వ్యక్తిని పలువురు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బాధితుడు షాబాద్ మండలం రేగడిదోస్‌వాడ గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డిగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News