కాపులకు పట్టిన శని జనసేన పార్టీ: మంత్రి అంబటి తీవ్ర విమర్శలు

జనసేన పార్టీపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అమ్ముడుపోయే పార్టీ అని ఎద్దేవా చేశారు.

Update: 2023-03-07 15:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అమ్ముడుపోయే పార్టీ అని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీని తెలంగాణలో వేలం పెట్టారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని నమ్మితే మునిగిపోతారని.. కాపులకు పట్టిన శని జనసేన పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. మంత్రి అంబటి రాంబాబును ప్రజలు మర్చిపోతున్నారని.. ఆయన హైలెట్ కావడానికే పనిగట్టుకుని జనసేన పార్టీపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అవుతున్నారు.

Tags:    

Similar News