NDAకు ఓటేయకపోతే ప్రజలకే నష్టం..జనసేనాని సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-29 09:30 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమికి ఓటేయకపోతే ప్రజలే నష్టపోతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నేను ప్రధాని మోడీతో ధైర్యంగా మాట్లాడగలను అని చెప్పారు. కానీ సీఎం జగన్‌కు ఆయనంటే భయం అన్నారు. కేసుల గురించే ఆయన మోడీని కలుస్తారు. రాష్ట్ర సమస్యలపై ఎన్నడూ ప్రధానిని కలవలేదు అని అన్నారు. అరటి తొక్క లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేయండి. జనసేన గళాన్ని అసెంబ్లీలో వినిపించాలి. అందుకే ఈ ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించండి అని జనసేనాని పిలుపునిచ్చారు.

Read More..

అభ్యర్థిని బెదిరించిన సీఐ సస్పెండ్..ఎక్కడంటే? 

Similar News