పొత్తులో అనూహ్య పరిణామం.. జనసేనకు పి.గన్నవరం సీటు

టీడీపీ, జనసేన పొత్తులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.....

Update: 2024-03-23 12:20 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన పొత్తులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పి.గన్నవరం సీటును తొలుత టీడీపీ అభ్యర్థి సరిపెల్ల రాజేశ్ (మహాసేన రాజేశ్)కు కేటాయించారు. అయితే మహేశ్ అభ్యర్థిత్వంపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో పి.గన్నవరం సీటును జనసేనకు చంద్రబాబు కేటాయించారు. ఈ మేరకు కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా పని చేసిన సత్యనారాయణ.. రెండు నెలల క్రితం జనసేనలో చేరారు. దీంతో పి.గన్నవరం అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు అవకాశం దక్కింది. 

Tags:    

Similar News