Ap News: ఘోర ప్రమాదం.. అక్కా చెల్లెళ్లు మృతి

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రొంపేరు కాలువ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టింది....

Update: 2024-05-12 16:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రొంపేరు కాలువ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాద వివరాలు సేకరించారు. మృతులు అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అక్కా చెల్లెళ్ల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News