గోడకూలి భవన నిర్మాణ కార్మికుడు మృతి
పాత ఇంటి గోడ కూలి భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన పోలవరం గ్రామంలో ఆదివారం జరిగింది.
దిశ, పోలవరం: పాత ఇంటి గోడ కూలి భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన పోలవరం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలవరం పంచాయతీ పాత పోలవరం గ్రామానికి చెందిన పోలవరపు వీరభద్రం (46) తన ఇంటికి సమీపంలో ఉన్న శిధిలావస్థలో ఉన్న ఇంటి గోడలు పడగొడుతున్న సందర్భంలో గోడ మీద కూలి మృతి చెందాడు. మృతునికి డిగ్రీ, టెన్త్ చదువుతున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు.