భారత్ బంద్.. ఖమ్మంలో అఖిలపక్ష నేతలు అరెస్ట్

by  |
భారత్ బంద్.. ఖమ్మంలో అఖిలపక్ష నేతలు అరెస్ట్
X

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలో భారత్ బంద్‌లో భాగంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అఖిలపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలను 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువాళ్ల దుర్గ ప్రసాద్, కాంగ్రెస్ కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంత్ రావు, సీపీఎం జిల్లా అధ్యక్షులు నున్న నాగేశ్వరరావు, టీడీపీ పార్లమెంటరీ సెగ్మెంట్ అధ్యక్షుడు కురపాటి వెంకటేశ్వర్లు ఉన్నారు.


Next Story

Most Viewed