అక్షయ్ ‘బెల్‌బాటమ్’ అప్‌డేట్

by  |
అక్షయ్ ‘బెల్‌బాటమ్’ అప్‌డేట్
X

బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ బెల్‌బాటమ్ మూవీ అప్‌‌డేట్ వచ్చేసింది. వాణీ కపూర్, హ్యూమా ఖురేషి, లారా దత్తా ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ జరుపుకోనున్న తొలి సినిమా కానుంది. ఆగస్టులో షూటింగ్‌ను యూకేలో స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటిస్తూ.. మూవీ యూనిట్ ఫొటో షేర్ చేసింది. ఈ పిక్‌లో కాస్ట్లీ వింటేజ్ కారుపై అక్షయ్ కూర్చోగా, తన పక్కన ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. సినిమా నిర్మాత జాకీ భగ్నానీ కూడా ఫొటోలో ఉన్నారు.

1980లో గూఢచర్యం నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న బెల్ బాటమ్‌లో ఇండియన్ లీడర్ గురించి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వాణీ కపూర్ నెగెటివ్ రోల్‌లో కనిపించనుండగా.. అక్షయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. తనతో నటించేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. పూజా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో మళ్లీ పని చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. రంజిత్ ఎం తివారీ దర్శకత్వం వహిస్తున్న సినిమాను వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే, అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’ నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుండగా.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సూర్యవంశీ చిత్రాన్ని దీపావళికి థియేటర్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్.

Next Story

Most Viewed