ఉస్మానియా ఆస్పత్రికి రూ.100 కోట్లు విడుదల చేయాలి

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: ఉస్మానియా ఆసుపత్రిలో డ్రైనేజీ వ్యవస్థను తక్షణమే బాగు చేయాలని అఖిల పక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ఇస్తానన్న రూ.100కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు అఖిలపక్షం నాయకులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ గురువారం ఓ ప్రకటన చేశారు.



Next Story