వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. షోయబ్ అక్తర్ సీరియస్ కామెంట్స్

by  |
వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. షోయబ్ అక్తర్ సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్ ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ముగిసింది. ఫైన‌లో కివీస్‌పై ఆస్ట్రేలియా సునాయాస విజయాన్ని అందుకుంది. దీంతో తొలిసారిగా టీ20 వరల్డ్‌ కప్‌ను ఆసీస్ తమ ఖాతాలో వేసుకుంది. అయితే వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’​ అవార్డును ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్​వార్నర్ గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్‌ ఆఫ్ ది సీరిస్‌ అవార్డుపై పాకిస్థాన్ దిగ్గజ బౌలర్, మాజీ ఆటగాడు షోయబ్​అక్తర్​అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ అవార్డు పాక్​కెప్టెన్, ఓపెనర్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజామ్‌కు దక్కుతుందని భావించానని వ్యాఖ్యలు చేశాడు. వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు ఇవ్వడం సరికాదని అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అయితే.. వరల్డ్ కప్‌లో బాబర్​ఆజామ్ 6 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేయగా.. వార్నర్​7 మ్యాచుల్లో 289 పరుగులు చేశాడు. వార్నర్‌కు ఈ అవార్డు దక్కడంపై ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్​కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ అవార్డు బౌలర్​ఆడమ్ జంపాకు దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు. జంపా ఈ టోర్నీలో మంచి ఎకానమితో 13 వికెట్లు పడగొట్టాడు.


Next Story