మణిరత్నం ప్రాజెక్ట్‌కు గుడ్‌బై చెప్పిన Aishwarya Rai Bachchan. షాక్ లో ఫ్యాన్స్

by  |
మణిరత్నం ప్రాజెక్ట్‌కు గుడ్‌బై చెప్పిన Aishwarya Rai Bachchan. షాక్ లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. స్టార్ కాస్టింగ్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్న‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం షూటింగ్ ముగించుకుంది. కాగా ఈ ప్రెస్టీజియస్ ఫిల్మ్‌లో కీలక పాత్రలో నటిస్తున్న మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్.. తాజాగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను పంచుకుంది. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ పూర్తయినట్లు తెలిపే న్యూ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించనప్పటికీ ‘సమ్మర్ 2022’లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లారిటీ ఇవ్వడం విశేషం.

లీడ్ యాక్టర్స్ ఎవరిని పోస్టర్‌పై కనిపించనివ్వని మేకర్స్.. మెరుస్తున్న కత్తి పిడికిలి భాగాన్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు. ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్.. ఒకింత షాక్ కి గురవుతున్నారు. అప్పుడే షూటింగ్ కంప్లీట్ అయిపోయిందా..? అని ఆశ్చర్యపడుతూనే సినిమా కోసం వెయిట్ చేయలేకపోతున్నామని కామెంట్స్ చేస్తూ ఐశ్వర్యకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, ప్రకాష్ రాజ్, జయం రవి, త్రిష, మోహన్‌బాబు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. కాగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి ఫిక్షన్ నవల ఆధారంగా ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed