ఒప్పందం కుదిరింది.. బస్సులు రైట్ రైట్

by  |
ఒప్పందం కుదిరింది.. బస్సులు రైట్ రైట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ చర్చలు సఫలం అయ్యాయి. తెలంగాణ నుంచి ఏపీకి 826, ఏపీ నుంచి తెలంగాణకు 638 బస్సులు నడిపేందుకు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. విజయవాడ రూట్‌లోనే 273 తెలంగాణ బస్సులు వెళ్లనున్నాయి. ఇక అదే రూట్‌ ఏపీ కూడా 192 బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, కర్నూల్‌-హైదరాబాద్ సెక్టార్‌లో 213 బస్సులను నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ ఓప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం తక్షణమే బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల ఎండీలు సంతకాలు చేశారు. కిలో మీటర్ల ప్రకారం బస్సులు నడపాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి.

Next Story