రైతులకు సాయం చేసిన కలెక్టర్.. ఆనందపడ్డ అన్నదాతలు

by Shyam |

<p>దిశ, జనగామ : రైతుల ధాన్యం తరలింపు కోసం జనగామ జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు రోడ్డుపై లారీలు ఆపిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తైనా మిల్లర్స్ వద్దకు ధాన్యం తరలింపు జరగకపోవడంతో.. కొనుగోలు చేసిన ధాన్యం వర్షానికి తడుస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జనగామ &#8211; హైదరాబాద్ జాతీయ రహదారిపై జిల్లా రవాణాశాఖ అధికారులతో కలసి లారీలను ఆపి.. [&hellip;]</p>

రైతులకు సాయం చేసిన కలెక్టర్.. ఆనందపడ్డ అన్నదాతలు
X

దిశ, జనగామ : రైతుల ధాన్యం తరలింపు కోసం జనగామ జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు రోడ్డుపై లారీలు ఆపిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తైనా మిల్లర్స్ వద్దకు ధాన్యం తరలింపు జరగకపోవడంతో.. కొనుగోలు చేసిన ధాన్యం వర్షానికి తడుస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జనగామ – హైదరాబాద్ జాతీయ రహదారిపై జిల్లా రవాణాశాఖ అధికారులతో కలసి లారీలను ఆపి.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలింపజేశారు. నాయకులు ఎవరూ స్పందించకున్నా కలెక్టర్ లారీలను ఆపి రైతులకు సహాయం చేయడంపై భాస్కర్ రావును జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.

Next Story