కార్మికులు తలకిందులుగా నిరసన

by  |
కార్మికులు తలకిందులుగా నిరసన
X

దిశ, సంగారెడ్డి: కంది మండలంలోని ఆశా కో పరిశ్రమ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. సోమవారం యాజమాన్యం వైఖరికి నిరసగా కార్మికులు తలకిందులుగా నిలబడి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు జి.సాయిలు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

మూడు నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని, కార్మికులందరినీ యథావిధిగా డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు 15 రోజులుగా సమ్మె చేస్తున్నా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే దాకా పోరాటం ఉద్ధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు కృష్ణ, నాగరాజు, నిజాముద్దీన్, బాబురావు, శ్రీనివాస్ రెడ్డి, మల్లన్న, మార్కండేయ, శశి భూషణ్ రెడ్డి, వెంకటేష్ తో పాటు కార్మికులు పాల్గొన్నారు.



Next Story