అత్తమామ వేధింపులకు అల్లుడు సూసైడ్ !

by  |
అత్తమామ వేధింపులకు అల్లుడు సూసైడ్ !
X

దిశ, వెబ్‌డెస్క్: అత్తమామ వేధింపులు తాళలేక అల్లుడు సూసైడ్ చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కంచన్‌బాగ్ పోలీస్ ‌స్టేషన్‌ పరిధిలోని బాబానగర్‌లో 23ఏళ్ల యువకుడు సయ్యద్‌ మోహిన్‌కు ఏడాది క్రితం కామారెడ్డి జిల్లాకు చెందిన యువతితో వివాహం అయ్యింది. అప్పటి నుంచి కూతురు దగ్గరే తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇదేక్రమంలో కూతురుతో అల్లుడు గొడవ పడ్డాడన్న కారణంతో తమ కూతురును కామారెడ్డిజిల్లాలోని ఇంటికి తీసుకుపోయారు.

అప్పటి నుంచి ఆ యువకుడు తన భార్యను పంపించాలని ఎన్నిసార్లు అత్తమామలను కోరినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే సయ్యద్ మోహిన్‌ను ఇబ్బందులు పెట్టడంతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకొని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed