- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్ సిటీ: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గడ్డ ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో రెండంతస్తుల పాత భవనం కూలిపోయింది. దర్వాజకు మరమ్మత్తులు చేపడుతుండగా, భవనం పగుళ్లు పట్టి కిందకు కుంగటం ప్రారంభించింది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం నగరంలో సంచలనం సృష్టించింది. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఇల్లు కావడంతో మరమ్మత్తులు ప్రారంభించారు. తాజాగా.. దర్వాజ తీసేందుకు యత్నిస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, డిజాస్టర్ సిబ్బంది సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. భవనం సెల్లార్లో ఇద్దరు వ్యక్తులుండగా, వారిని 108 సిబ్బంది సురక్షితంగా వెలికి తీశారు.
Next Story