ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ఢీకొని పదేళ్ల బాలుడు మృతి

by  |
road accident
X

దిశ, కామారెడ్డి: దర్గాకు వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన మీర్జా ఖుర్రం అనే వ్యక్తి తన మనవడు మహ్మద్ ఇమ్రాన్‌ను బైకుపై ముందు కూర్చోబెట్టుకుని దేవునిపల్లి నుంచి టెక్రియాల్ దర్గా వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి నుంచి టెక్రియాల్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ అతివేగంగా వెళ్తూ ఎదురుగా వెళ్తున్న బైకును ఢీకొంది. దీంతో బైకు ముందు భాగంలో కూర్చున్న ఇమ్రాన్ కిందకు ఎగిరిపడ్డాడు. తలకు తీవ్ర గాయమై ముక్కునుంచి రక్తం కారుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. బైకుపై ఉన్న ఖుర్రంకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed