రంజాన్ వేళ.. మసీదులో బాంబు పేలుడు, 12 మంది మృతి

by  |
bomb blast, Masjid
X

కాబుల్: రంజాన్ వేళ అప్ఘనిస్తాన్‌‌లో దారుణం చోటు చేసుకుంది. అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ఓ మసీదులో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని మసీదులో ప్రార్థనలు ప్రారంభం కాగానే ఈ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు తామే బాధ్యుల మంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదని పోలీసులు పేర్కొన్నారు. మత గురువు టార్గెట్‌గా బాంబులను అమర్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed