టెన్షన్ ఏం లేదు.. మొత్తం కంట్రోల్ లో ఉంది - ఇండియన్ ఆర్మీ

by velandi.Saikiran |

పాకిస్తాన్ ( Pakisthan) ఇండియా సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని.. ఎలాంటి టెన్షన్ లేదని తాజాగా ఇండియన్

టెన్షన్ ఏం లేదు.. మొత్తం కంట్రోల్ లో ఉంది - ఇండియన్ ఆర్మీ
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ ( Pakisthan) ఇండియా సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని.. ఎలాంటి టెన్షన్ లేదని తాజాగా ఇండియన్ ఆర్మీ ( Indian Army) ప్రకటన చేసింది. పాకిస్తాన్ డ్రోన్లు ( Pakisthan Drones) ఎలాంటివి ప్రస్తుతం కనిపించడం లేదని వివరించారు ఆర్మీ అధికారులు. ఇది ఇలా ఉండగా కొన్ని గంటల కిందట జమ్మూ కాశ్మీర్ లోని ( Jammu and Kashmir) సాంబా సెక్టర్ లోకి.. పాక్ డ్రోన్లు వచ్చాయని వార్తలు వచ్చాయి.

దీంతో వెంటనే అలెర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ వర్గాలు... వాటిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం అయితే... పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆర్మీ అధికారులు వెల్లడించడంతో... అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా... ఇండిగో ( Indigo ) తాజాగా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలలో... పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం రోజున కొన్ని విమానాలను రద్దు చేసింది ఇండిగో. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాలలో మాత్రమే... విమానాలు రద్దు చేసింది.


Next Story