- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Operation Sindoor: ‘చాలా ఓపిక పట్టి ఎటాక్ చేశాం’.. కల్నన్ సోఫియా ఖురేషీ కీలక ప్రకటన

దిశ, వెబ్డెస్క్: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై కల్నన్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్(Wing Commander Vyomika Singh) కీలక అప్డేట్ ఇచ్చారు. శుక్రవారం మరోసారి ఢిల్లీలో వీరు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురువారం రాత్రి పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ దాడులకు తెగబడింది. లేహ్ నుంచి సర్క్రీక్ వరకు మొత్తం 36 చోట్ల ఎటాక్ చేసింది. ఈ దాడులను గమనించిన భారత సైన్యం వెంటనే అప్రమత్తమైంది. కైనటిక్, నాన్ కైనటిక్ సాధనాలతో సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ప్రస్తుతం పాక్ ప్రయోగించిన డ్రోన్ శిథిలాల కింద పరిశీలన జరుగుతోంది. ఆ డ్రోన్లు టర్కీకి చెందినవిగా తెలుస్తోంది. బటిండా సైనిక స్థావరంతో పాటు కశ్మీర్లోని తంగ్దర్, యురీలో కూడా దాడికి ప్రయత్నం చేశారు. భారత్ చేసిన ప్రతిదాడిలో పాకిస్తాన్ చాలా తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పౌర విమానాలను కవచంగా ఉపయోగించుకొని దాడి చేస్తోంది. భారత గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్లు.. యుద్ధ విమానాలు వచ్చాయి.. ప్రతిదాడుల విషయంలో భారత్ సంయమనం పాటించింది.. భారత మిలిటరీ లక్ష్యాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది.. 300- 400 డ్రోన్లతో పాక్ దాడికి ప్రయత్నించింది.. వాటిని సమర్థవంతంగా కూల్చేశామని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ స్పష్టం చేశారు.