Breaking: అన్ని రాష్ట్రాల సీఎంల‌తో అమిత్ షా అత్య‌వస‌ర స‌మావేశం

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ ఉధ్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

Breaking: అన్ని రాష్ట్రాల సీఎంల‌తో అమిత్ షా అత్య‌వస‌ర స‌మావేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ ఉధ్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో మధ్యాహ్నం 2గంటలకు వర్చువల్‌గా ఈ సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. యద్ధ వాతావరణం నేపథ్యంలో షా సీఎంలకు, అధికారులకు భద్రత విషయంలో పలు సూచనలు చేసే అవకాశం ఉంది. మరోవైపు తదుపరి తాము తీసుకునే నిర్ణయాలు, దాని వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి కూడా షా చర్చించే అవకాశాల ఉన్నాయి. ఇక ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలర్ట్ అయిన సంగతి తెలిసిందే.

Next Story