Operation Sindoor: భారత్ ఆర్మీపై నటి పోస్ట్ పెట్టడంతో నెట్టింట ట్రోల్స్.. క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదంటూ నెటిజన్లకు వార్నింగ్

by Hamsa |
Operation Sindoor: భారత్ ఆర్మీపై నటి పోస్ట్ పెట్టడంతో నెట్టింట ట్రోల్స్.. క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదంటూ నెటిజన్లకు వార్నింగ్
X

దిశ, సినిమా: భారత్-పాక్ మధ్య రోజు రోజుకు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఎదురవుతున్నాయి. భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టి పాక్‌ను చిత్తు చిత్తు చేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు దూరంగా పారిపోతున్నారు. ఈక్రమంలో.. యావత్ భారతీయులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ పలు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, హీరోయిన్ సెలీనా జైట్లీ(Celina Jaitley) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భారత సైనికులను పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నేను దూరంగా ఉండవచ్చు, కానీ నా ఆత్మ భారతదేశంతో నిలుస్తుంది. మన ధైర్యవంతులైన భారత సాయుధ దళాలు కవచంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీ ధైర్యం కేవలం పోరాటంలో కాదు.

మన దేశాన్ని రక్షించడానికి మీరు వేసే ప్రతి అచంచలమైన అడుగులో ఉంది. మేము ఇక్కడ ఉన్నాము, సురక్షితంగా ఊపిరి పీల్చుకున్నామంటే దానికి కారణం మీరే అని రాసుకొచ్చింది. దీంతో ఆమెపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఆమెను కొంతమంది బెదిరించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో సెలీనా మరో పోస్ట్ పెట్టింది. ‘‘నా దేశం గురించి మాట్లాడితే కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని అంటున్నారు. వారందరికీ నేను ఒకటే చెబుతున్నాను. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు.

ఎవరు ఏమనుకున్నా నా దేశానికి అండగా ఉంటా. ఉగ్రవాదం పేరుతో అమాయకులను బలి తీసుకుంటే స్పందించకుండా మౌనంగా ఉండలేను. భారత్‌పై నాకున్న ప్రేమ మిమ్మల్ని బాధపెడితే నన్ను ఆన్‌ఫాలో చేయండి అంతే కానీ క్షమాపణలు చెప్పనుజ శాంతి, సత్యం కోసం నిలబడతా. నా దేశ సైనికుల వెంటే నేనుంటాను. కులం, మతం అని అడగకుండా మమ్మల్ని కాపాడుతున్నారు. నాపై ట్రోల్స్ గమనిస్తున్నా. ఇలాంటి వారిని అస్సలు క్షమించను’’ అని వార్నింగ్ ఇచ్చింది. ఈ పోస్ట్ వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.



Next Story

Most Viewed