ఆ రోజు ధోనీ కన్నీరు పెట్టుకున్నాడు : హర్భజన్ సింగ్

by Disha Web Desk 13 |
ఆ రోజు ధోనీ కన్నీరు పెట్టుకున్నాడు : హర్భజన్ సింగ్
X

చెన్నయ్: మైదానంలో ఎంఎస్ ధోనీ కోపంగాగానీ, ఎమోషనల్‌గానీ ఉండటం చాలా అరుదు. ఎంత ఒత్తిడి ఉన్నా చాలా కూల్‌గా ఉంటాడు. కానీ ఓ సందర్భంలో ధోనీ కన్నీరు పెట్టుకున్నాడట. తాజాగా ఓ క్రీడా చానెల్ షోలో పాల్గొన్న టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ‘మీతో నేను ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌లోకి తిరిగి వచ్చింది. ఆ సందర్భంలో ఏర్పాటు చేసిన టీమ్ డిన్నర్‌లో ధోనీ కన్నీరు పెట్టుకున్నాడు.

అతడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు. దీని గురించి ఎవరికీ తెలియదని అనుకుంటున్నాను. నిజమే కదా? ఇమ్రాన్ తాహిర్?’ అని హర్భజన్ చెప్పాడు. అదే షోలో పాల్గొన్న సీఎస్కే మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ స్పందిస్తూ..‘నేను కూడా అక్కడే ఉన్నా. అతనికి చాలా ఎమోషనల్ మూమెంట్. అప్పుడు జట్టు అతనికి ఎంత దగ్గరగా ఉందో నాకు తెలిసింది. ధోనీ ఎమోషనల్ అవడం అక్కడ ఉన్నవారందరిని భావోద్వేగానికి గురిచేసింది’ అని తాహిర్ చెప్పుకొచ్చాడు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story