IPL 2023: గుజరాత్‌తో పోటీకి 'సై' అంటున్న సన్ రైజర్స్..

by Disha Web Desk 13 |
IPL 2023: గుజరాత్‌తో పోటీకి సై అంటున్న సన్ రైజర్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్‌లో చివరి దశకు చేరుకున్నది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉండగా.. నాలుగో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఆర్సీబీ, కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఇంకా మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ ఇవాళ సన్ రైజర్స్‌తో తమ హోమ్ గ్రౌండ్‌లో తలపడనుంది. హార్థిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ జైత్రయాత్రకు సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్డుకట్ట వేస్తుందా.. లేదా అనేది వేచి చూడాలి. అయితే సన్‌రైజర్స్ ఇప్పటికే ఐపీఎల్ నుంచి పూర్తిగా నిష్క్రమించగా.. ఈ మ్యాచ్ కేవలం నామమాత్రమే జరుగనునది.

ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరుగనుంది. పాయింట్స్ టెబుల్‌లో గుజరాత్ 16 పాయింట్లతో టాస్ ప్లేస్‌లో ఉండగా, సన్‌రైజర్స్ 8 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్ గుజరాత్ గెలిస్తే ప్లే ఆఫ్‌‌కి క్వాలిఫై అయిన తొలి టీమ్‌గా నిలుస్తుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed