ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు ఆ దేశాల నుంచి చీఫ్ గెస్ట్లు

by Dishafeatures2 |
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు ఆ దేశాల నుంచి చీఫ్ గెస్ట్లు
X

దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023 ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్ కు చేరుకోగా.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్ ఈ నెల 26న జరగనుంది. అందులో గెలిచిన జట్టు ఈ నెల 28న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నయ్ తో తలపడనుంది. కాగా ఈ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా అందించారు.

ఈ ఫైనల్ మ్యాచ్ కు బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక క్రికెట్ బోర్డుల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఇక మ్యాచ్ అనంతరం 2023 ఆసియా కప్ కు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చలు జరుపనున్నట్లు జై షా చెప్పారు. కాగా టాటా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు ఈ టోర్నీలో పాల్గొన్న ౧౦ జట్లకు సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరవుతారని సమాచారం.

Next Story

Most Viewed