Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బొలెరో, ఎనిమిది మంది దుర్మరణం

by Disha Web Desk 1 |
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బొలెరో, ఎనిమిది మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: బొలెరో వాహనం లోయలో పడి ఎనిమిది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలోని ఉంచకోట్ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేపాల్ మూలాని ప్రాంతానికి చెందిన 10 మంది బొలెరో వాహనంలో తనక్‌పూర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారి బొలెరో వాహనం బేతాల్‌ఘాట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఉంచకోట్‌ వద్దకు రాగానే అతివేగంతో అదుపుతప్పి పక్కనే ఉన్న 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా కొనసాగింది. మొత్తం ఏడుగురి మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story

Most Viewed