కన్నకొడుకే కాలయముడా...?.. మహిళను హత్య చేసి సంపులో పడేసిన వైనం

by Disha Web Desk 23 |
కన్నకొడుకే కాలయముడా...?.. మహిళను హత్య చేసి సంపులో పడేసిన వైనం
X

దిశ,దుండిగల్ : ఓ మహిళను బండరాయితో మోది హత్య చేసి ఈడ్చుకెళ్లి నీటి గుంతలో పారవేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే నర్సాపూర్ మండలం,ఎర్రకుంట తండా కు చెందిన లంబాడీ సక్కుబాయి(46) భర్త చనిపోగా 3 కుమారులతో 4 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి డి పి పల్లి సర్వే నెంబర్ 120 లో ఉంటూ క్యాటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది.ఈ నెల 20వ తేదీ పని నిమిత్తం బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు.

21న నీటిగుంతలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కొడుకు శేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. కన్న కొడుకే మరో ఇద్దరితో కలిసి తల్లిని హతమార్చి నీటి గుంతలో పడేసినట్లు సమాచారం. ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed