కామారెడ్డి...సిరిసిల్ల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి

by Disha Web Desk 15 |
కామారెడ్డి...సిరిసిల్ల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి
X

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ వద్ద కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు కారులో వస్తుండగా చెట్టుకు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు‌. వివరాల్లోకి వెళితే కామారెడ్డికి చెందిన ఆలకుంట యాద నర్సయ్య (52) ఈ ప్రమాదంలో మృతి చెందారు. అతని భార్య ఆలకుంట లలిత, శివరాత్రి దిలీప్ (9)

ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం సిరిసిల్లలో తన బంధువుల ఇంటికి ఎల్లమ్మ పండుగ సందర్భంగా వెళ్లి తిరిగి వస్తుండగా గురువారం ఐదు గంటల ప్రాంతంలో చుక్కాపూర్ వద్ద రోడ్డు పక్కన గల చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో కారు ముందరి భాగం నుజ్జయింది. డ్రైవింగ్ చేస్తున్న యాద నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మాచారెడ్డి పోలీసులు కారులో చిక్కుకుపోయిన యాద నర్సయ్య శవాన్ని స్థానికుల సహాయంతో బయటకు లాగి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Next Story

Most Viewed