వివాహానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌డెడ్

by Disha Web Desk 4 |
వివాహానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాంగ్లి జిల్లాలో కారు-బస్సు ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. కారులోని వ్యక్తులు వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కర్ణాటక బాగల్ కోట్‌లో వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. జంబుల్‌వాడి వద్ద విజాపూర్-గుహగార్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed