- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీ ఎన్నికల బరిలో జబర్దస్త్ కమెడియన్ బాబు సోదరుడు.. ప్రచారానికి సిద్దం అంటున్న ఇమ్మానుయేల్ టీమ్
దిశ, సినిమా: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నామినేషన్ వేసిన వారు ప్రచారంలో బిజీ అయ్యారు. అయితే, ఏపీ ఎన్నికల బరిలో జబర్దస్త్ కమెడియన్ బాబు సోదరుడు డేగల సైదరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ప్రచారానికి జబర్దస్ టీం కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 6, 7 వ తేదీన జబర్దస్త్ వర్ష, ఇమ్మానుయేల్, ఫైమా, నూకరాజు , నరేష్, జితేంద్ర, గడ్డం నవీన్ , శ్రీ విద్య , జబర్దస్త్ బాబు, వెంకీ ఈ ఎన్నికల బరిలో సైదరాజు ను గెలిపించాలని, అతని కోసం షూటింగ్స్ కూడా పక్కన పెట్టి ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గుర్తులు కేటాయించింది. ఎన్నికల పోలింగ్కు ఇంకా పదకొండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ ప్రచార జోరును పెంచాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో పోటీలోకి దిగారు. అందులో భాగంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జబర్దస్త్ కమెడియన్ బాబు సోదరుడు డేగల సైదరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సైదరాజు రెంటచింతల మండలం రెంటచింతల గ్రామానికి చెందినవాడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సైదరాజు చెబుతున్నాడు.