ఆటోను ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు

by Disha Web Desk 1 |
ఆటోను ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నంద్యాల పట్టణంలోని అయ్యలూరు జాతీయ రహదారిపై ఉణ్న ఉన్న డాబా ఎదుట ఆటో‌ను ఇన్నోవా కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు, కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను నంద్యాల సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై ఆ ఏరియా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మూల మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా సూచీ బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed