- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పర్వతగిరి గ్రామానికి చెందిన బానోత్ భద్రు గత పది సంవత్సరాలుగా అయోధ్య పురం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని కుమార్తె ఝాన్సీ(14) 8వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు మందలించారని మనస్థాపంతో నాలుగు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు గమనించి ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజుల నుంచి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story