340 కిలోల గంజాయి పట్టివేత, 8మంది అరెస్ట్

by  |
340 కిలోల గంజాయి పట్టివేత, 8మంది అరెస్ట్
X

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌ నగరంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 8మందిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 340కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫ్‌నగర్ పీఎస్ పరిధిలో ఆరుగురు, హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అఫ్జల్‌సాగర్‌లో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక ఆటో, 6 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. అటు ముషీరాబాద్‌లో అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లను విక్రయిస్తున్న నిసార్ అహ్మద్ , ఎన్. వెంకట సుబ్బారావును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 40కేజీల ఆక్సిజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

Next Story

Most Viewed