తెలంగాణలో తాజాగా 617 కరోనా కేసులు

by  |
తెలంగాణలో తాజాగా 617 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో తాజాగా 617కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,82,347కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,518 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,569 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,74,260 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 65,20,993 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story