తెలంగాణలో తాజాగా 551 కరోనా కేసులు

by  |
తెలంగాణలో తాజాగా 551 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తాజాగా 551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక వ్యక్తి మరణించాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,80,195 కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,506 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,040 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,71,649 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 63,54,388 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story