కొత్తగా 53 కార్పొరేషన్ల ఏర్పాటు..

by  |
కొత్తగా 53 కార్పొరేషన్ల ఏర్పాటు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కొత్తగా 53 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే మూడు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా వీటి సంఖ్యను 56కు పెంచింది. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదని వైసీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల 18న కొత్త కార్పొరేషన్లకు చైర్మన్, డైరక్టర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 139 వెనుకబడిన కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా, అందులో సగానికి పైగా మహిళలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed