- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటించిందని, అయితే 1 జూలై 2018 తర్వాత పలు శాఖల్లో చేరిన సుమారు 50 వేల మంది ఉద్యోగులకు ఈ పీఆర్సీ, ఫిట్మెంట్అమల్లోకి రాలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.
కొత్తగా చేరిన ఉద్యోగులకు పీఆర్సీ, ఫిట్మెంట్ అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీరందరికీ 30 శాతం పీఆర్సీని అమలుచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకు 30 శాతం పీఆర్సీ అందజేస్తుందో లేదో క్లారిటీ ఇవ్వాలని రఘునందన్రావు డిమాండ్చేశారు.
Next Story