తెలంగాణలో 9వేల యాక్టివ్ కేసులు.. తాజా బులిటెన్ రిలీజ్

by  |
corona active cases in telangana district wise
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆదివారం 91,457 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 494 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, రాష్ట్రంలో ఆక్టీవ్ కేసుల సంఖ్య 9,405కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో నలుగురు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3,784కి చేరుకుంది.

అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 76, కరీంనగర్‌లో 49, ఖమ్మంలో 40, పెద్దపల్లిలో 30, రంగారెడ్డిలో 31, వరంగల్ అర్బన్‌లో 43 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 15, జగిత్యాలలో 24, జనగాంలో 05, జయశంకర్ భూపాలపల్లిలో 04, జోగుళాంబ గద్వాలలో 05, మహబూబాబాద్‌లో 12, మహబూబ్‌నగర్‌లో 06, మంచిర్యాలలో 11, మెదక్‌లో 05, ములుగులో 04, నాగర్‌కర్నూల్‌లో 03, నల్గొండలో 19, నారాయపేటలో 01, నిజామాబాద్‌లో 06, రాజన్న సిరిసిల్లలో 12, సంగారెడ్డిలో 12, సిద్ధిపేటలో 14, సూర్యాపేటలో 14, వికారాబాద్‌లో 01, వనపర్తిలో 03, వరంగల్ రూరల్‌లో 18, యాదాద్రి భువనగిరిలో 09 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 1,63,913 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయగా వీటిలో మొదటి డోసు వ్యాక్సిన్‌ను 29,736 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్‌ను 1,34,177 మందికి పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం మొదటి డోసు వ్యాక్సిన్‌ను 1,10,68,414 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్‌ను 29,37,514 మందికి పంపిణీ చేశారు.



Next Story