తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా

by  |
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తాజాగా గత 24 గంటల్లో 316 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,515 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,590 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,73,625 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 64,75,766 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story