రూ.300 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

by  |
Heroin Seized at Mumbai
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ అక్రమ రవాణాలు దేశంలో రోజురోజుకూ పెరిపోతున్నాయి. మహారాష్ట్రలోని ముంబై నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు రూ. 300 కోట్ల విలువైన 290 కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇద్దరిని అదుపులోకి తీసుకొని డీఆర్ఐ అధికారులు విచారిస్తు్న్నారు. ఇలాంటి డ్రగ్స్‌ దందాను రూపుమాపేందుకు పోలీసులు, అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నా.. అక్రమ డ్రగ్స్‌ సరఫరా కొనసాగుతూనే ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.



Next Story

Most Viewed