ఫ్లాష్ ఫ్లాష్ : రద్దీ మార్కెట్‌లో భారీ పేలుడు.. 30 మంది మృతి

by  |
bomb-blast
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉగ్రమూకలు మరోసారి తమ ఉన్మాదాన్ని ప్రదర్శించాయి. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని రక్తపుటేర్లు పారించాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగర శివారులో సంభవించిన బాంబు పేలుడులో సుమారు 30 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. పవిత్రమైన బక్రీద్​(ఈద్-అల్​-అదా) పండుగ నేపథ్యంలో జనం రద్దీగా ఉండే మార్కెట్ ఏరియాలో ఉగ్రవాదులు బాంబు పేల్చారు.

సోమవారం జరిగిన ఈ ఘటనతో బాగ్దాద్ నగరం ఒక్కసారిగా దద్దరిల్లింది. రద్దీ మార్కెట్లలో బాంబు పేలుడు సంభవించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి అని అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా ప్రస్తుత పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.

Next Story

Most Viewed