- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రారంభమైన అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ-హబ్ మొదలుపెట్టిన టి-ట్రైబ్ ద్వారా లాంచ్ప్యాడ్ ప్రోగ్రామ్ నుంచి మొదటి బ్యాచ్ 208 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు గురువారం ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఎంటర్ప్రెన్యూర్షిప్లో అవసరమైన పరిజ్ఞానాన్ని అందుకోవడంతో పాటు వ్యాపార రంగంలో విజయం సాధించేందుకు వీలవుతుందని టీ-హబ్ తెలిపింది.
‘గత కొన్నేళ్లలో ఎంటర్ప్రెన్యూర్షిప్ విద్య మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. చాలామంది యువకులు వ్యాపారంలో విజయం సాధించాలనే లక్ష్యంతో వ్యాపార మెలకువలను నేర్చుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు. టీ-ట్రైబ్ కార్యక్రమం ద్వారా విద్యార్థులను స్టార్టప్ కంపెనీల విభాగంలో తక్కువ సమయంలో ఎదిగే అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది కరోనా కారణంగా అవాంతరాలు ఎదురైనప్పటికీ లాంచ్ప్యాడ్ ప్రోగ్రామ్ నుంచి విద్యార్థులు శిక్షణ చేయగలిగారని’ టీ-హబ్ సీఈఓ రవి నారాయణ్ చెప్పారు.