వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం

by  |
వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం
X

దిశ, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రిలో తొలి కరోనా మరణం సంభవించింది. నాలుగు రోజుల కిందట కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన వెంకటయ్య కరోనా అనుమానిత లక్షణాలతో ఎంజీఎంలో చేరాడు.రెండ్రోజుల కిందట అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది.ఈ మేరకు అతన్ని వైద్యులు ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు.కాగా, పరిస్థితి విషమించి ఈ రోజు సాయంత్రం మృతి చెందినట్లు ఎంజీఎం నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్ర శేఖర్ అధికారికంగా వెల్లడించారు.



Next Story

Most Viewed