జీఎస్టీ కౌన్సిల్‌కు ముందు రాష్ట్రాలతో ఫైనాన్స్ కమిషన్ భేటీ

by  |
జీఎస్టీ కౌన్సిల్‌కు ముందు రాష్ట్రాలతో ఫైనాన్స్ కమిషన్ భేటీ
X

దిశ, న్యూస్‌బ్యూరో : పదిహేనవ ఆర్థిక సంఘం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో మార్చి 13వ తేదీన సమావేశం కానుంది. మార్చి 14న ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉండడంతో ఆ సమావేశానికి వచ్చే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ముందురోజు సమావేశమవనున్నట్లు కమిషన్ చైర్మన్ ఎన్.కె.సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల పంపకంపై ఇప్పటికే కమిషన్ మధ్యంతర నివేదికనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, 2024 దాకా సమయానికి నిధుల పంపకంపై రాష్ట్రాలతో చర్చించడానికే ఈ సమావేశమేర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎఫ్ఆర్‌బీఎమ్ చట్టానికి అనుగుణంగా రాష్ట్రాల ఎఫ్ఆర్ బీఎమ్ నిబంధనలుండాలన్నదానిపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Next Story