సునీత వైన్స్‌లో చోరీ.. వాటి వరకే ఎత్తుకెళ్లిన దొంగలు

by  |
సునీత వైన్స్‌లో చోరీ.. వాటి వరకే ఎత్తుకెళ్లిన దొంగలు
X

దిశ మోత్కూరు : మున్సిపల్ కేంద్రంలోని ఓ వైన్ షాప్ లో చోరీ జరిగిన సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పోతాయి గడ్డలో ఉన్న సునీత వైన్స్ కౌంటర్ టేబుల్ సందులో పడేసి ఉండడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో షాపు నిర్వాహకులు వచ్చి చూడగా గుర్తుతెలియని వ్యక్తులు షెట్టర్ తాళం పగలగొట్టి కౌంటర్ టేబుల్ని ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న సందులో పడేశారు. అలానే టేబుల్ డెస్క్లో ఉన్న సుమారు 15 వేల నగదు ఎత్తుకెళ్లి నట్లు నిర్వాహకులు తెలిపారు. దొంగలు మద్యం జోలికి వెళ్లక పోవడం విశేషం.ఈ విషయం పై మోత్కూర్ పోలీసుల కు సమాచారం అందించగా స్థానిక ఎస్ఐ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించింది.

Next Story

Most Viewed