ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : యూపీ బరాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బస్సును ట్రక్కు ఢీ కొన్న ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. బస్సులో చాలమంది ఉన్నట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసు సూపరింటెండెంట్ యమునా ప్రసాద్ పోలీసు బలగాలతో పాటు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.



Next Story