ఏపీకి చేరుకున్న 11,76,000 కొవిడ్ టీకా డోసులు

by  |
Covid-19 vaccine wastage:
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రానికి మరో 11,76,000 కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 98 బాక్సుల్లో టీకాలు వచ్చాయి. ఈ టీకాలను అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు కాస్త ఉపశమనం కలిగినట్లైంది.

Next Story

Most Viewed