ఈ 3 మండలాలకు 108 వాహనం దూరం!

by  |
ఈ 3 మండలాలకు 108 వాహనం దూరం!
X

దిశ, సంగారెడ్డి: ఎక్కడైన రోడ్డు ప్రమాదం జరిగినా లేదా అత్యవసర సమయాల్లో ఆదుకోటానికి 108 వాహనం ముందు ఉంటుంది. కానీ, అల్లాదుర్గం, వట్పల్లి, రేగోడు మండలాకు అత్యవసర సమయాల్లో ఆదుకునే 108 సేవలు దూరమయ్యాయి. ఈ మూడు మండలాలకు సేవలందించేందుకు అల్లాదుర్గంలో అందుబాటులో ఉండే అంబులెన్స్ పెద్దశంకరంపేటకు తరలించడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. దీంతో అత్యవసర సమయాలో ప్రైవేటు వాహనాల కోసం ఎదురుచూడాల్సి వస్తుందని.. వాహనాలు లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతున్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలక్రితం పెద్దశంకరంపేట మండలంలోని 108 వాహనం చెడిపోవడంతో అల్లాదుర్గం నుంచి అక్కడికి తరలించారు. కానీ, ఇంతవరకు తిరిగిరాలేదు. దీంతో మండలంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులను ఆస్పత్రికి తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 108 రాకపోవటంతో ఆటోలను ఆశ్రయించవలసి వస్తున్నదని తెలిపారు. మండలంలో అలాగే ఎక్కడైనా ప్రమాదం జరిగినా అంబులెన్సు అందుబాటులో లేకుండాపోయింది. అల్లాదుర్గంలో 108 ఉంటే సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలానికి కూడా సేవలందించేది, ఇప్పుడు రెండు మండలాల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. అల్లాదుర్గంలో 108 అంబులెన్స్ లేకపోవడంతో ఎదురువుతున్న ఇబ్బందులు జిల్లా వైద్యాధికారికి ప్రజలు విన్నవించారు. స్థానిక ఆస్పత్రిలో కాన్పులు ఎక్కువగా జరుగుతుండడంతో గర్భిణులను తరలించడానికి అంబులెన్స్ తప్పనిసరి అయ్యింది. 108 వాహనాన్ని తిరిగి పంపించాలని కోతున్నారు. రేగోడ్ మండలానికి ప్రభుత్వం మంజూరు చేసిన 108 వాహనాన్ని ఐదేళ్ల క్రితం తాత్కాలికంగా పెద్దశంకరంపేటకు తరలించారు. ఆ తరువాత తిరిగి పంపనే లేదు. ఇప్పుడు అల్లాదుర్గం 108 ను కూడా అక్కడికే పంపడంతో దీనిని కూడా అక్కడే ఉంచేస్తారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు మండలాలకు సేవలందించే కీలకమైన ప్రాంతంలో ఉండే అంబులెన్సును మరోచోటికి తరలించడం విడ్డూరమని ప్రజలు విమర్శిస్తున్నారు.


Next Story

Most Viewed