- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: “నిరుద్యోగులెవరూ అధైర్య పడొద్దు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటివారితోనైనా పోరాటం చేద్దాం. మీ అక్కగా నేను కోరేది ఒక్కటే.. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు. రేపటి భవిష్యత్ కోసం నేడు మార్పు తేవాల్సిందే. ఆ మార్పు కోసం అందరం కలిసి పోరాడుదాం” అని షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే నిరుద్యోగ యువకుడు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, అలాంటిది తెలంగాణ వచ్చింది, కేసీఆర్ కు అధికారం వచ్చింది, కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రం రాలేదని విమర్శలు చేశారు.
నిరుద్యోగులు అధైర్యపడద్దు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధం. నిరుద్యోగ యువతను .. మీ అక్కగా నేను కోరేది ఒక్కటే. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. రేపటి భవిష్యత్తు కోసం.. నేడు మార్పు తేవాల్సిందే. ఆ మార్పు కోసం మనం కలిసి పోరాడుదాం. pic.twitter.com/fTwoqcVU7F
— YS Sharmila (@realyssharmila) April 28, 2021
అయ్యా KCR సారు, "కనీసం మీ పార్టీ పుట్టిన రోజైనా చస్తే మా నిరుద్యోగులను గుర్తిస్తారేమో నని" నోటిఫికేషన్లు లేక మనస్థాపానికి గురై నల్గొండ నిరుద్యోగి శ్రీకాంత్ నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నడు. ఇకనైనా నిద్ర లేవండి. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి. నిరుద్యోగ హత్యలు ఆపండి. pic.twitter.com/a4GOjaP3et
— YS Sharmila (@realyssharmila) April 28, 2021
“కనీసం మీ పార్టీ పుట్టిన రోజైనా చస్తే మా నిరుద్యోగులను గుర్తిస్తారేమోనని శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు” అని ట్వీట్ చేశారు. ఇంతకన్నా టీఆర్ఎస్ కు అవమానం ఉండదని షర్మిల పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్, చందమామల్లాంటి పిల్లలు చనిపోతున్నారని మొసలి కన్నీరు కార్చారని, ఇలా నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా? అంటూ మండిపడ్డారు. వందల్లో నిరుద్యోగ యువత బలిదానాలు చేసుకుంటున్నా మీరు కానీ, మీ మంత్రులు కానీ కనీసం భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.